ఆనంద్: అముల్ డెయిరీ సంస్థ లీటరు పాలపై రెండు రూపాయలు పెంచింది. బుధవారం నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్లే పాల ధరను పెంచినట్లు అముల్ ఓ ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్, సౌరాష్ట్ర మార్కెట్లో అర లీటరు అముల్ గోల్డ్ పాలను రూ.31కి అమ్ముతున్నారు. అర లీటరు అముల్ తాజా రూ.25కు, అముల్ శక్తి లీటరు పాలను రూ.28కి అమ్ముతున్నారు. లీటరుపై రెండు రూపాయలు పెంచడం అంటే, ఎంఆర్పీపై రూ.4 పెరిగినట్లు అని ఆ సంస్థ తన ప్రకటనలో చెప్పింది. పాల ధరను పెంచడం వల్ల పాల ఉత్పత్తిదారులకు భరోసా ఇచ్చినట్లు అవుతుందని ఆ సంస్థ తెలిపింది.