హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ను రైతు వ్యతిరేకి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. దీనిపై ఇవాళ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. అది జోక్ ఆఫ్ ద సెంచరీ అని అన్నారు. తన ట్విట్టర్లో రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని, ఆ పథకాన్నే పీఎం కిసాన్ పేరుతో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం జరిగిందని, సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, రైతులు ఆగ్రహానికి గురైన ప్రధాని మోదీ ఆ తర్వాత వారికి క్షమాపణలు చెప్పింది నిజం కాదా అని కేటీఆర్ తన ట్వీట్లో ప్రశ్నించారు.
ఫసల్ బీమా యోజన పథకంలో తెలంగాణ సర్కార్ చేరలేదని సీఎం కేసీఆర్పై షా విమర్శలు చేశారని, కానీ గుజరాత్లోని బీజేపీ సర్కార్ కూడా ఆ స్కీమ్ను వ్యతిరేకించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. స్వంత రాష్ట్రం గుజరాత్కే ఆ స్కీమ్ మంచి చేయనప్పుడు, అది తెలంగాణ రాష్ట్రానికి ఎలా మంచి చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా అర్థరహితమైన హిపోక్రసీని అమిత్ షా వదిలిపెట్టాలని కేటీఆర్ సూచించారు.
Amit shah Ji calling Hon’ble CM KCR Garu “Anti-farmer” is joke of the century 😁
❇️ Who copied KCR’s brainchild “Rythu Bandhu” & rebranded it as PM-Kisan?
❇️ Who apologised to the Farmers of the nation after facing their wrath over Farm-laws; After loosing 700 valuable lives?
— KTR (@KTRTRS) August 22, 2022