అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత ( Amaravati Legitimacy Bill) కల్పిస్తూ ఆమోదించి లోక్సభ, రాజ్యసభ బిల్లు సోమవారం రాష్ట్రపతి భవన్ ( Rashtrapati Bhavan) కు చేరుకుంది. బిల్లుపై న్యాయ నిపుణులను సంప్రదించాక ఈ రోజే రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి . రాష్ట్రపతి ఆమోదం అనంతరం అమరావతి బిల్లు చట్టరూపం దాల్చనుంది.
రాష్ట్ర విభవన నాటి నుంచి నేటి వరకు ఏపీకి రాజధాని లేకుండా పోయింది. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీకి నూతన రాజధాని అమరావతి ఉంటుందని అందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో మూడు రాజధానుల పేరిట గందరగోళం సృష్టించారు.
అమరావతి రైతులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమై వ్యతిరేకించాయి . 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కూటమి సర్కార్ అధికారంలోకి రావడం, కేంద్రంలోని బీజేపీ సర్కార్కు కీలక భాగస్వామ్యంగా మారడంతో అమరావతి రాజధానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ వచ్చింది.
చివరకు కేంద్రం సూచనలతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చట్ట సవరణ బిల్లుకు తీర్మానం చేసి పంపడం, రెండు రోజుల్లోనే లోక్సభ, రాజ్యసభ సమావేశాల్లో ప్రవేశ పెట్టి మూజువాణి ఓటుతో ఈ తీర్మానానికి ఆమోదం తెలుపడంతో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపారు.