తిరుపతి,9మే :ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ గత శుక్రవారం జారీచేసిన ఆదేశాల ప్రకారం అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థ చిత్తూరు జిల్లా లోని నూనెగుండ్లపల్లి , కరకంబాడి ఫాక్టరీలలో ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
పర్యావరణము, భద్రత,ఆరోగ్య వ్యవస్థలకు అత్యధిక ప్రాధాన్యత కొనసాగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సహకరించి ఏ విధమైనటువంటి సమస్యలనైనా పరిష్కరించే దిశలో సంస్థ తరపున కార్యాచరణ చేపడుతోంది. గత కొద్దిరోజులుగా ఉన్న తాత్కాలిక అంతరాయం వల్ల కంపెనీ కార్యాలాపాలపై ఎటువంటి ప్రభావం లేదని ,సంస్థ ఉత్పత్తులను యధావిధిగా అందించగలమని భాగస్వాములందరికీ హమీ ఇచ్చింది అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్.
“సంస్థ వినియోగదారులకు మా వస్తువులను, సేవలను ఎటువంటి అంతరాయం లేకుండా సకాలంలో సరఫరా చేయడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలూ తీసుకున్నాము. అలాగే ఈ స్వల్పకాలిక అంతరాయం ప్రభావాన్ని అంచనా వేసుకుంటున్నాము. మాపై ఎంతో విశ్వాసం ఉంచిన సంస్థ ఉద్యోగులు, కస్టమర్లు, విక్రయదారులు , ఇతర భాగస్వాములందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ” కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు.