వనపర్తి, నవంబర్ 24 : వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లే దు. ఈ క్రమంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. అందులో భాగంగా వ్యవసాయ అధికారులు రైతు వేదికల్లో రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లను భాగస్వాములు చేస్తూ రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. ప్రత్యామ్నాయ పంటలే మేలని అధికారులు సూచిస్తున్నారు. ఏయే భూముల్లో ఏ పంటలు సాగు చేస్తే.. ఎంత దిగుబడి వస్తుందో వివరించారు. ఈ క్రమంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక పుష్కలంగా సాగునీరందడంతో వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. బీడు భూముల్లో సైతం వరి సాగు చేశారు. దీంతో అందరూ ఒకే రకమైన పంట పండించడం వల్ల మార్కెట్లో నిల్వ పెరిగిపోయి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. రైతులు నష్టపోకుండా ఇతర పంటల వైపు దృష్టి సారించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. వరి సాగు చేస్తే ఒకేసారి డబ్బులు చేతికి వస్తాయని.. కూరగాయల సాగుపై దృష్టి సారిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా వర్షాధార పంటలైన కంది, పెసర, మినుములు వంటి తదితర ప్రత్యామ్నాయ పంటలను నీటి పారుదలగా మారిస్తే మంచి దిగుబడులు వస్తాయని వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అధికారులు అవగాహన కల్పించడంతో గత యాసంగి కంటే ఈ సారి జిల్లాలో రైతులు మినుముల సాగుపై ఎక్కువ దృష్టి సారించారు. 2018-19 యాసంగిలో 17,769 ఎకరాల్లో మినుములు సాగు చేయగా.. ఈ ఏడాది యాసంగిలో 24,692 ఎకరాల్లో (గతేడాది కంటే 6,923 ఎకరాలు అధికం) సాగు చేస్తున్నట్లు అధికారుల అంచనా.
పత్తి
ఇతర పంటలు 1,578 33
మొత్తం 1,48,150 57,969