‘పుష్ప’ చిత్రం హిందీ బెల్ట్లో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో గత సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసును షేక్ చేసిన మరో బన్నీ మూవీ ‘అల వైకుంఠపురములో..’ చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. హిందీలో కొత్త సినిమాలు లేకపోవడంతోపాటు మాస్ ప్రేక్షకులను మెప్పించే కథలు అక్కడ తక్కువయ్యాయని విమర్శలు ఉన్నాయి.
ఈ క్రమంలో పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన పుష్ప ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సరిగా ప్రమోషన్స్ చేయకపోయినా మంచి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్-అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో..’ చిత్రాన్ని హిందీలో డబ్ చేశారు.
దీన్ని జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్దే నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో ఇప్పటికే రీమేర్ చేసేస్తున్నారు కూడా. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జోడీగా నటిస్తున్నారు.