గోదావరిఖని, మే 9 : మూడెకరాల భూమి కబ్జా చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామస్థులు స్పష్టంచేశారు. ఆదివారం గ్రామ కచ్చీడు వద్ద కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, జనగామ కవిత గ్రామస్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బినామీల పేర్లతో మంత్రి కొప్పుల భూకబ్జా చేశారని, మున్సిపల్ అధికారులతో మాట్లాడి తన భూమి దాకా రోడ్డు వేయించుకున్నారని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. గ్రామ అవసరాల కోసమే రోడ్డు నిర్మాణం జరిగినట్టు స్పష్టంచేశారు. మంత్రిపై అభియోగం చేస్తున్న అందుగుల శ్రీను అనే వ్యక్తి భూమిని కొంత అమ్ముకోగా, కొంత రాజీవ్ రహదారి కింద పోయిందని పేర్కొన్నారు. శ్రీనుకు అక్కడ భూమి లేదని, అతను చేస్తున్న అభియోగంలో నిజం లేదని చెప్పారు.