హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అల్లం నారాయణ పదవీ కాలం ఈ ఏడాది జూన్ 30వ తేదీతో ముగిసింది. 2022, జులై 1 నుంచి 2024 జూన్ 30 వరకు మీడియా అకాడమీ చైర్మన్గా పదవిలో కొనసాగుతారు. అల్లం నారాయణకు మీడియా అకాడమీ చైర్మన్ పదవిని పొడిగించడం ఇది మూడోసారి.
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా మూడవ సారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి 3వ సారి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు చెప్పారు.