చెన్నై, మార్చి 20: స్మార్ట్ఫోన్ల ద్వారా తీసే వీడియోల్లో స్పష్టతతో పాటు త్రీడీ ఎఫెక్ట్లను మెరుగుపరిచే విధంగా మద్రాస్ ఐఐటీ, అమెరికాకు చెందిన నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కృత్తిమ మేధస్సు ఆధారిత డీప్ లెర్నింగ్ అల్గారిథమ్లను అభివృద్ధి చేశారు. ఈ అల్గారిథమ్లు మొబైల్ ఫోన్లలో ఇమేజ్లు ఫ్లాట్గా కనిపించకుండా, వాస్తవిక త్రీడీ ఎఫెక్ట్ అనుభూతిని అందిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీడియోలను మరింత స్పష్టంగా తీసేందుకు లెన్సులు లేదా ఇతర పరికరాల అవసరాన్ని తొలగించడం తాజాగా అభివృద్ధి చేసిన అల్గారిథమ్ కీలకమైన ప్రయోజనం.