హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ) : విద్యార్థులు, అధ్యాపకులతో పాటు బయటి వ్యక్తుల వాహనాల కాలుష్యంతో కలుషితమవుతున్న క్యాంపస్ను గ్రీన్ క్యాంపస్గా తీర్చిదిద్దాలని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్(జేపీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగం వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తు అంధకారమవుతున్నదని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం జేపీఎఫ్ నాయకుడు జవ్వాజి దిలీప్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్రావుకు ఫిర్యాదు చేశారు.
క్యాంపస్లోకి మత్తు పదార్థాలను నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఆ విద్యార్థి సంఘం నేతలు కోరారు. క్యాంపస్లోకి మోటర్ సైకిళ్లు, కార్లకు బదులుగా కనీసం 100 సైకిళ్లు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జేపీఎఫ్ నాయకులు శ్రీనివాసరావు, సాయి తనూజ్, శ్రీకాంత్, విశాల్, వసంత్, ప్రణయ్ చక్రవర్తి, ధీరజ్, జగదీశ్, విద్యార్థి నాయకురాలు సంగెం సిరి, లక్ష్మి, భావన తదితరులు పాల్గొన్నారు.