ఇండియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో.. ఆఫ్గానిస్థాన్తో జట్టు 28 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (16) రన్స్ చేసి మానవ్ సుతార్ బౌలింగ్లో మహ్మద్ సిరాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సుతార్ తన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయడం విశేషం. ప్రస్తుతం గుర్భాజ్ (6), సెదిక్ (13) క్రీజులో ఉన్నారు.
కాగా, న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్గానిస్థాన్న్తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో(Test match) శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ సాధించిన శతకాలతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (177 బంతుల్లో 126, 15ఫోర్లు, 1సిక్స్), కేఎల్ రాహుల్(100), సెంచరీలు సాధించగామూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్(52) అర్ద శతకాలతో ఆకట్టుకున్నారు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో సలీమ్ సాఫి 6 వికెట్లతో చెలరేగాడు. రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిదీ తలొక వికెట్ పడగొట్టారు. కాగా, బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై లభించిన అవకాశాన్ని యశస్వి జైస్వాల్సద్వినియోగం చేసుకోలేకపోయాడు.సఫీ బౌలింగ్లో (24) పరుగులకే వెనుదిరిగాడు.