ఢిల్లీ ,జూన్ 8: విశాఖలో తూర్పు నౌకాదళం(ఈఎన్సీ)కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సమక్షంలో,’322 డేగ ఫ్లైట్’ పేరుతో హెలికాప్టర్ల చేరిక కార్యక్రమం జరిగింది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్లు(ఏఎల్హెచ్)ఎంకే-3 హెలికాప్టర్లు, నౌకాదళ కేంద్రం ఐఎన్ఎస్ డేగలో లాంఛనంగా విధుల్లోకి చేరాయి. ఈ సముద్ర నిఘా,తీర భద్రత (ఎంఆర్సీఎస్) హెలికాప్టర్ల చేరికతో, దేశ ప్రాదేశిక జలాల ప్రయోజనాల పరిరక్షణలో,శక్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈఎన్సీకి గట్టి ప్రోత్సాహం లభించినట్లయింది. ‘హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ నిర్మించిన అత్యాధునిక హెలికాప్టర్లు ఇవి ‘ఆత్మనిర్భర్ భారత్’లో ప్రధానంగా మారాయి.