ఎదులాపురం, డిసెంబర్ 19 :ప్రజావాణిలో అందిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను సోమవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో ఇచ్చిన అర్జీని సంబంధిత అధికారులు పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. భూ సమస్యలు, పింఛన్లు, ఉపాధి తదితర సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, జడ్పీ సీఈవో గణపతి, మున్సిపల్ కమిషనర్ శైలజ, జిల్లా సంక్షేమ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీలను సత్వరం పరిష్కరించండి
నిర్మల్ టౌన్, డిసెంబర్ 19 : ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాం బాబు అధికారులకు సూచించారు. కలెక్టర్ కా ర్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి.. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కువగా భూ సమస్యలు, డబుల్బెడ్రూం ఇండ్లు, పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని సూచించారు. మొత్తం 20 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.