ఎదులాపురం, నవంబర్ 25 : ప్రత్యేక ఓటరు నమోదు, నూతన ఓటరు జాబితా సవరణ సమర్థ వంతంగా నిర్వహించాలని ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఆదిలాబాద్ కలెక్టర్తో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడు తూ డిసెంబర్ 3, 4 తేదీల్లో బూత్ స్థాయి అధి కారులు వారి పోలీంగ్ కేంద్రాలలో అందు బాటులో ఉండి ఓటరు నమోదు, మార్పులు చేర్పులు ఏర్పాట్లు చేపట్టాల న్నారు. బూత్ స్థాయి సూపర్ వైజర్లు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఓటరు నమోదు కార్యక్రమాలను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదికలు సమర్పించాలన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రజలను చైతన్య వంతులను చేస్తూ అర్హత గల వారి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆది లాబాద్ కలెక్టర్ సిక్తా పట్నా యక్ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉండి ఓటరు నమోదు, మార్పులు చేర్పులు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవోలు రమేశ్ రాథోడ్, కదం సురేశ్, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, సూపర్వైజర్లు పాల్గొన్నారు.