ఎదులాపురం, డిసెంబర్ 2: ఓడ్ కులస్తులకు గు ర్తింపునిచ్చింది సీఎం కేసీఆరేనని, దశల వారీగా సమస్యలు కూడా పరిష్కరిస్తారని ఆదిలాబాద్ ఎ మ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఓడ్ కుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగు రామన్న ను గురువారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ఆయనను కోరారు. దీంతో వెంటనే స్థానిక తహసీల్దార్తో మాట్లాడి సమస్యను పరిష్క రించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ… గతంలో ఏ ప్రభుత్వమూ ఓడ్ కులస్తులను పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఓడ్ కుల స్తులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎం బీ సీ, ఓబీసీలో చేర్పించాలని ఓడ్ కులస్తులను విన్నపాన్ని సీఎంకు తెలియజేస్తామన్నారు. అలాగే ఆ త్మగౌరవ భవనాలు నిర్మించి ఇస్తామని హామీని చ్చారు. జిల్లాలో అన్ని కుల సంఘాలకు ఇచ్చిన వి ధంగానే సంఘ భవనాన్ని నిర్మించేందకు కృషి చే స్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్రం అధ్యక్షుడు పవర్ కైలాస్, గౌరవాధ్యక్షుడు రామ్ కిషన్ మహారాజ్, మెహిత్ సంతోష్, జిల్లా అధ్యక్షుడు పవర్ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి సాలుంకే శంకర్, మారుతి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.