ఢిల్లీ ,జూలై : అదానీ గ్రూపునకు చెందిన కొన్ని సంస్థల లావాదేవీలపై సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లు దర్యాప్తు జరుపుతున్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌధ్రి ప్రకటించిన నేపథ్యంలో అదానీ షేర్స్ భారీగా పతనమయ్యాయి. ఈ ప్రకటనతో నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ పతనమయ్యాయి. సోమవారం ఒక్కరోజే అదానీ టోటల్ గ్యాస్ 4.77 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 4.07 శాతం, అదానీ పవర్ 2.8 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 2.76 శాతం, అదానీ పోర్ట్స్ 2.08 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.01 శాతం నష్టపోయాయి.
అదానీ టోటల్ గ్యాస్ ఇవాళ కూడా భారీగా పతనమైంది. ఈరోజు మరో 5 శాతం క్షీణించి రూ.812 వద్ద ట్రేడ్ అయింది. అదానీ ట్రాన్స్మిషన్ షేర్ 5 శాతం తగ్గి రూ.919 వద్ద, అదానీ పవర్ షేర్ 4.99 శాతం క్షీణించి రూ.97.05 వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా 5 శాతం తగ్గి రూ.930.20 వద్ద, అదానీ పోర్ట్స్ 1.39 శాతం తగ్గి రూ.664.35 వద్ద, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 2.29 శాతం తగ్గి రూ.1349 వద్ద ట్రేడ్ అయింది.