Jayasudha | సినీ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, కీర్తి సురేశ్, త్రిష ఇలా చాలామంది కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా సహజ నటి జయసుధ కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారని.. వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నారు.
పద్నాలుగేండ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయసుధ.. తనదైన నటనతో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. దాదాపు 48 ఏండ్ల సినీ కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలకు అక్కగా, తల్లిగా, బామ్మగా నటించారు. 2019లో వచ్చిన మహర్షి, రూలర్ సినిమాల తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొద్దిరోజులుగా అమెరికాలోనే ఉంటుంది. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి మిగిలిన జీవితాన్ని అక్కడే గడపబోతుందని తెలుస్తోంది.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
“Jayasudha : జయసుధ మొహం ఇలా అయిపోయిందేంటి?”
“సహజనటి జయసుధకు ఏమైంది.. ఎందుకు ఇలా మారిపోయింది..?”
కెరీర్లో దూసుకెళ్తున్న టైంలో లతా మంగేష్కర్పై విషప్రయోగం.. చేసింది ఎవరో..
Sekhar | రాజశేఖర్ ఎదురుచూపులు.. పర్ఫెక్ట్ డేట్ కోసం చూస్తున్న శేఖర్