కరోనా తగ్గుముఖం పట్టడంతో చిత్రసీమలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. షూటింగ్లు యథావిధిగా జరుగుతున్నాయి. సినిమా ప్రచార కార్యక్రమాల్లో తారలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఇటీవలకాలంలో అగ్రహీరోలు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రముఖ కథానాయకుడు కమల్హాసన్కు ఈ మధ్యే కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. తాజాగా తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన విక్రమ్ కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆయన చెన్నైలోని స్వగృహంలో ఐసోలేషన్లో ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం విక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’, గౌతమ్మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నక్షత్రం’చిత్రాలతో పాటు ‘కోబ్రా’ ‘మహాన్’ సినిమాల్లో నటిస్తున్నారు.