మహబూబ్ నగర్ : ప్రముఖ తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ ( Namasthe Telangana ) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు నర్సింహారెడ్డి ( Narasimha Reddy ) పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ( BRS Leader ) డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నాడు స్థానిక ఎస్సైకి ఫిర్యాదు చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట, లగచర్ల గ్రామాల పరిధిలో ఎడ్యుకేషన్ హబ్, పారిశ్రామిక వాడ కోసం సేకరించిన భూముల్లో రైతులకు అన్యాయం జరుగుతున్న విషయాలను ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో పరిశోధనాత్మక కథనాలు ప్రచురితమయ్యాయి. హకీంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నర్సింహారెడ్డి పత్రికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ మద్దూరు పట్టణ నాయకులు ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ప్రజలకు, పాలకులకు అనుసంధానకర్తగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రజలకు మేలు జరిగేలా వ్యవహరించే పత్రికలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యని ఆరోపించారు. కాంగ్రెస్పూ చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.