అమరావతి : నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కర్మాగారంలో పనిచేస్తున్న కూలీలు ర్యాంపుల పై నుంచి కింద పడి ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని కొలిమిగుండ్ల సిమెంట్ కర్మాగారంలో వెల్డింగ్ పను లు చేస్తుండ గా విద్యుదాఘాతంతో పై నుంచి కిందపడ్డారు. ఈ ఘటనలో పశ్చిమబెంగాల్కు చెందిన రహీం (27), సుమన్ (22) అనే ఇద్దరు కూలీలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలా నికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని మృతుల బంధువులకు సమాచారం అందజేశారు.