సమీక్షలో అధికారులకు మేయర్ ఆదేశాలు
సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ జోన్లోని లంగర్ హౌస్ చెరువు క్లీనింగ్, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు వేగవంతం చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్ల తో లంగర్ హౌస్ వద్ద చేపట్టే పనులపై ఆమె గురువారం సమీక్షించారు. లంగర్ హౌ స్ చెరువు హుడా పార్ ప్రాంతంలో అపరిశుభ్రంగా ఉన్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అకడ సుందరీకరణ తదితర పనులు చేపట్టాలని మేయ ర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. లంగర్ హౌస్ చెరువులో ప్రవహిస్తున్న మురుగు నీరు, పోగవుతున్న గుర్రపు డెక ద్వారా దోమలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతున్నాయని అధికారులు వివరించారు. ప్రజలకు దోమల బెడద, చెరు వు నుంచి వెదజల్లే దుర్వాసనలు తొలగించేందుకు చెరువు నందు ప్రత్యేక నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 39 చెరువులలో అధిక స్థాయిలో ఉన్న గుర్రపు డెకను గుర్తించామని, 31 చెరువులలో గుర్ర పు డెకను తొలగించేందుకు పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు శానిటేషన్, హెల్త్ అడిషనల్ కమిషనర్ సంతోష్ మేయర్కు వివరించారు. సమావేశంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు, ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ రత్నాకర్ పాల్గొన్నారు.