అమరావతి : విద్యుత్ కనెక్షన్ కోసం లంచం తీసుకుంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగులను ఏసీబీ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విజయవాడలోని ఎస్పీడీసీఎల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (AE) గా పనిచేస్తున్న శ్రీనివాస్రావుతో పాటు జూనియర్ అసిస్టెంట్ ఒకరు వినియోగదారుడు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
మీటర్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు సోమవారం ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులు పక్కా వ్యూహంతో దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.