AAP : విపక్షాలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో చెలరేగుతున్న పాలక కాషాయ కూటమి రాజకీయ ప్రత్యర్ధులను వేధించడమే పనిగా పెట్టుకుందని ఆప్ ఆరోపించింది.
బీజేపీ సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేని రాష్ట్రాల్లో విపక్ష సర్కార్లను కూల్చేసేందుకు ఆపరేషన్ లోటస్కు తెరలేపుతుందని తాము మొదటినుంచీ చెబుతున్నామని, ఇప్పుడు అదే జరుగుతోందని ఆప్ పంజాబ్ ప్రతినిధి మల్వీందర్ సింగ్ కాంగ్ అన్నారు.
రవ్నీత్ సింగ్ బిట్టు బీజేపీలో చేరగానే చేసిన వ్యాఖ్యలు కాషాయ పార్టీ తీరుకు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల అనంతరం ఢిల్లీ, పంజాబ్లో ఆప్ ప్రభుత్వాలను తాము పడగొడతామని రవ్నీత్ సింగ్ బాహాటంగా చెబుతున్నారని కాంగ్ దుయ్యబట్టారు. కాగా పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడు రవ్నీత్ సింగ్ బిట్టు ఇటీవల కాషాయ పార్టీలో చేరారు.
Read More :
Rohit Sharma | రోహిత్ ఫ్యాన్స్ కొడితే ధోనీ అభిమాని తల పగిలింది..