దుబాయ్: భారత్కు చెందిన ఓ బిజినెస్మ్యాన్ స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులిచ్చి బెదిరించాడని ఆరోపించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ప్రకటించిన అతడిపై మూడున్నరేండ్ల నిషేధం విధించింది. దీనిలో డోప్ టెస్టులో విఫలమైన కారణంగా కూడా ఒక నెల నిషేధం విధించింది. ‘జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్పై మూడున్నరేండ్ల పాటు నిషేధం విధిస్తున్నాం. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ ఉల్లంఘనపపై నాలుగు ఫిర్యాదులు, ఐసీసీ డోపింగ్ వ్యతిరేక కోడ్ కింద ఒక ఫిర్యాదు కింద ఈ చర్యలు తీసుకున్నాం’ అని ఐసీసీ ప్రకటించింది. 2019 అక్టోబర్లో ఓ వ్యాపారవేత్త భారత్కు ఆహ్వానించి.. అంతర్జాతీయ క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడాల్సిందిగా ఒత్తిడి చేశారని టేలర్ తెలిపిన విషయం తెలిసిందే. దీనికోసం తనకు 15 వేల డాలర్లు ఇచ్చినట్లు రెండేండ్ల కిందట జరిగిన ఘటన వివరాలను బ్రెండన్ ఈనెల 24న వెల్లడించాడు. ఆలస్యంగా ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన కారణంగా ఐసీసీ నిషేధం విధించింది. జింబాబ్వే తరఫున 34 టెస్టులు, 205 వన్డేలు, 45 టీ20లు ఆడిన బ్రెండన్ టేలర్ 2021 సెప్టెంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.