భారీ వర్షం కారణంగా గురువారం ముంబయి విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ విమానం ప్రమాదవశాత్తు రన్ వేపై నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలుకాగా, మొత్తం 8మంది గాయపడ్డారని ముంబయి విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. పూర్తిగా ధ్వంసమైన విమానాన్ని రన్ వేపై నుంచి తరలించేందుకు అధికారులు తంటాలు పడ్డారు. దీంతో విమానాశ్రయంలో కొన్ని గంటలపాటు విమాన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
విశాఖపట్నం నుంచి బయల్దేరిన ప్రైవేట్ విమానం(లియర్జెట్ 45) ముంబయి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.