ఆదిలాబాద్ రూరల్, మార్చి 7 : మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా రెండో రోజు సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్లో మహిళలు సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద మహిళలతో కలిసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని మరువలేమని అన్నారు. అనంతరం మహిళలు మానవహారం చేపట్టారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పాటు వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, మార్చి 7 : మహిళల భద్రత, రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో మహిళా సిబ్బంది, అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. జిల్లాలోని మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళా అధికారులకు వృత్తి పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు ఎల్లవేళలా సహాయపడుతానని తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణకు రెండు షీటీంలు పని చేస్తున్నాయని ఎల్లవేళలా మహిళలు వీటిని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మహిళల రక్షణకు పోలీసులు ప్రతి క్షణం అప్రమత్తమై పని చేస్తుంటారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(పరిపాలన) శ్రీనివాస్రావు, కార్యాలయ సూపరింటెండెంట్ జోసెఫిన్, ఎస్ఐలు దివ్యభారతి, పెర్సిస్, ప్రవళిక, ధనశ్రీ, రాధిక, అంజమ్మ, ఏఎస్ఐలు సవిత, వెంకటమ్మ, అనిత, జయలక్ష్మి, కవిత, సునీత, దైవశాల, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
బోథ్, మార్చి 7 : గుర్రాలతండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నవయువ మహాజన యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సమాజంలో మహిళల పాత్ర అనే అంశంపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పసుల గంగాధర్, సవిత, యూత్ అధ్యక్షుడు రాజశేఖర్, సభ్యులు హరీశ్, రాకేశ్, శివ, ప్రవీణ్కుమార్, క్రాంతికుమార్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, మార్చి 7: కేసీఆర్ మహిళా బంధు సంబురాల్లో భాగంగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు పారిశుధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ముస్తాఫా, నాయకులు వెంకటేశ్, దాసరి భాస్కర్, రషీద్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, మార్చి7 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు పారిశుధ్య కార్మికులు, కామాటీలు, వైద్యులు, ఆశ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా ఉద్యోగులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, కోవ రాజేశ్వర్, సర్పంచ్లు గాంధారి, రాథోడ్ శారద, విజయ, రాంచందర్, ఉపసర్పంచ్ గణేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు హరిదాస్, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి కనక హనుమంత్రావ్, నాయకులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మార్చి 7 : టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నదని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ పేర్కొన్నారు. కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఘన్పూర్, లక్కారం, వేణునగర్లో మహిళా ఉద్యోగులు, ఆశ కార్యకర్తలను శాలువాలతో సన్మానించారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసి సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో సర్పంచ్ లత, నాయకులు పాల్గొన్నారు.
ఉట్నూర్, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ దళిత నాయకురాలు రాజమణిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు నందిరెడ్డి, రమేశ్, కొలిపాక రాజశేఖర్, విజయ్, రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, మార్చి 7 : మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్కంటి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తూ వారితో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ గండ్రత్ రమేశ్, సర్పంచ్ లక్ష్మి, నాయకులు నరేశ్, శ్రీనివాస్, సాంబయ్య, రవి, వసంత్ పాల్గొన్నారు.
తలమడుగు, మార్చి 7: మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, ఎంపీటీసీ చంటి, రైతు బంధు సమితి మండలాధ్యక్షడు గోక జీవన్ రెడ్డి, ఝరి పీఎసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి. టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు రాంబాయి, సునీత రెడ్డి, పల్లవి, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.