హైదరాబాద్ : బిర్యానీ కోసం వెళ్లిన వ్యక్తిని హత్య చేసిన కేసులో 9 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 15న కేపీహెచ్బీ మొఘల్స్ రెస్టారెంట్లో బిర్యానీ కోసం వెళ్లిన రాజేశ్ అనే వ్యక్తిపై సిబ్బంది దాడి చేశారు. అదే రోజు రెస్టారెంట్ మేనేజర్ అరవింద్ పుట్టిన రోజు కావడంతో సెల్లార్లో సిబ్బంది మద్యం సేవించారు.
సెల్లార్ వద్దకు వచ్చిన రాజేశ్ను మద్యం మత్తులో హోటల్ సిబ్బంది చితకబాదారు. రాజేశ్ను 3 గంటల పాటు కర్రలు, ఐరన్ రాడ్లతో బాదుతూ చిత్రహింసలకు గురి చేశారు. రెస్టారెంట్ సిబ్బంది దెబ్బలకు తాళలేక రాజేశ్ మరుసటి రోజు మృతి చెందాడు. ఈ హత్య కేసులో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3 సెల్ఫోన్లు, ఒక స్కూటీ, కర్రలు, ఐరన్ రాడ్లు, వాటర్ పైపులను స్వాధీనం చేసుకున్నారు.