Viral video: హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని ఒక హోటల్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. టిఫిన్ ఫ్రీగా ఇవ్వలేదని మద్యం మత్తులో ఉన్న రాజు యాదవ్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. కౌంటర్లో ఉన్న హోటల్ యజమానురాలుపై హెల్మెట్ విసిరికొట్టాడు. ఆ తర్వాత వాటర్ బాటిల్తో కూడా దాడికి పాల్పడ్డాడు.
ఇంతలో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ శశికాంత్ ఘటనా ప్రాంతానికి వచ్చాడు. వీరంగం ఆడుతున్న రాజు యాదవ్ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ రాజు యాదవ్ కానిస్టేబుల్పై కూడా పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఫ్రీగా టిఫిన్ ఇవ్వలేదని హోటల్ యజమానురాలిపై దాడి
కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో
మద్యం మత్తులో రాజు యాదవ్ అనే యువకుడి తనకు ఫ్రీగా టిఫిన్ ఇవ్వలేదని హోటల్ యజమానురాలిపై హెల్మెట్, వాటర్ బాటిల్తో దాడి చేశాడు.అడ్డు వచ్చిన కానిస్టేబుల్ శశికాంత్ రెడ్డిపై సైతం పిడుగుద్దులతో దాడి… pic.twitter.com/ukr6JIYWEY
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2024