తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ ఐఐటీ క్యాంపస్లో నాలుగు జింకలు మృత్యువాతపడ్డాయి. ఇందులో ఒక జింక అత్యంత అంటువ్యాధి అయిన ఆంత్రాక్స్తో మృతిచెందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మిగతా మూడు జింకలకు సంబంధించిన టెస్టులు ఇంకా రాలేదు. ఈ విషయాన్ని ఐఐటీ మద్రాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
జింకల కళేబరం కనిపించిన ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా శానిటైజ్ చేశారు. వైల్డ్ లైఫ్ వార్డెన్ సలహా మేరకు క్యాంపస్ మొత్తాన్ని శుద్ధిచేస్తున్నారు. ఆంత్రాక్స్ అనేది జునోటిక్ వ్యాధి. అంటే ఇది జంతువులనుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి భద్రతా చర్యలను చెన్నై కార్పొరేషన్తోపాటు వన్యప్రాణి, పశుసంవర్థక శాఖ అధికారులు చూసుకుంటున్నారని ఐఐటీ మద్రాస్ అధికారులు పేర్కొన్నారు.