మహబూబ్నగర్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్మడం , అక్కడ ఉన్న జాతీయ పక్షి నెమళ్ళను, రాష్ట్ర జంతువు కృష్ణ జింకలను చంపుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలనీ పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వీ కన్వీనర్(BRSV convener ) గడ్డం భరత్ బాబు, ఎస్ఎఫ్ఐ ( SFI ) అధ్యక్షులు బత్తిని రాము డిమాండ్ చేశారు.
సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు వేలం పెట్టి అమ్మడాన్ని నిరసిస్తూ పాలమూరు యూనివర్సిటీలో గురువారం ధర్నా చేపట్టి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి పచ్చని మణిహారంగా ఉండి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవులను నెలమట్టం చేసి, 400 ఎకరాల యూనివర్సిటీ భూములను సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ సంస్థలకు అమ్మడం సిగ్గుచెటైనా చర్యని విమర్శించారు.
బుల్డోజర్లతో యూనివర్సిటీ అడవులను చదును చేస్తుంటే అక్కడి పక్షులు,జంతువుల అరుపులు వినపడడం లేదా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూములను కాపాడాలని శాంతియుత నిరసనలు చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణహని అన్నారు. ఎన్నికల్లో సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ తిరిగిన రాహుల్ గాంధీకి హెచ్సీయూ భూముల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటాలు కన్పించడం లేదా అని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ భూములను కేసీఆర్(KCR) పరిరక్షించారని తెలిపారు. యూనివర్సిటీలో కొత్త భవనాలను కట్టడానికి స్థలం అవసరమైతే కావలసిన స్థలాన్ని రేవంత్ రెడ్డి ఎక్కడినుండి తెస్తారని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని రద్దు చేసేంతవరకు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ నాయకులు ఆంజనేయులు,రామకృష్ణ, లక్ష్మణ్ నాయుడు,రాజగోపాల్, రాము, కావేరి, చైత్ర, నవనీత, పూజిత, ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీను, కిరణ్, రామకృష్ణ రాముడు, కవిత, మాధవి, గీతాంజలి పాల్గొన్నారు .