అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రెండురోజులుగా వెయ్యికి చేరువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 947 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
వైరస్ బారినపడిన వారిలో 377 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 8,97,810 చేరింది. 8,85,892 మంది చికిత్సకు కోలుకున్నారు.
మరో 4715 యాక్టివ్ కేసులుండగా.. 7203 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,696 శ్యాపింళ్లను పరీక్షించారు.