Thiruveer’s ‘Paapam Prathap’ | టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం సుమారు మూడు వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఈటీవీ విన్’ (ETV Win) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా మే 7 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తిరువీర్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించగా, అజయ్ ఘోష్ కీలక పాత్రలో మెరిశారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రతాప్ అనే యువకుడికి, పెళ్లయిన మూడు రోజులకే తన భార్య దూరమవ్వడం.. ఆమె తనపై ఒక వింత ఆరోపణ చేయడం అనే ఆసక్తికరమైన పాయింట్తో ఈ సినిమా సాగుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సహజసిద్ధమైన కామెడీ మరియు భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ చిత్రం డిజిటల్ వేదికగా రాబోతుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Popcorn ready…
Play button kuda ready 😎🔥
From May 7 #PapamPrathap kadhu Veera Prathap antaru 😉A Win original production
Premiers May 7th on @etvwin 📺@iamthiruveeR @krishna_kri @rakeshreddy1224 @ThisisNitin1111 @payal_radhu @arvindmule_pd @vishutheone @GuruKiran87… pic.twitter.com/rVGh3C37xO
— ETV Win (@etvwin) May 5, 2026