హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8690 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 49,175 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. జలాశయంలో ప్రస్తుతం 879.30 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టులో 215.8070 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే ప్రస్తుతం 184.7060 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదత్పత్తి కొనసాగుతున్నది.