అనంతపురం: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8మంది కరోనా రోగులు మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారని ఆరోపిస్తూ మృతుల బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు పగులగొట్టినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆక్సిజన్ విడుదల చేయించి మృతుల బంధువులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. 8 మంది రోగులు ఒక్కసారిగా మృతిచెందడంతో వారి బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి మార్మోగిపోయింది.