హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,994 మంది వైరస్ బారినపడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. వైరస్ బారినపడి తాజాగా 58 మంది ప్రాణాలను కోల్పోయారు. నిన్న 4,009 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో క్రియాశీల కేసులు 76వేలు దాటాయి. ప్రస్తుతం 76,060 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో రాష్ట్రంలో 80,181 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పింది.
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,630 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్లో 615, రంగారెడ్డిలో 558, నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్లో 301, సూర్యపేటలో 264, సిద్దిపేటలో 269, మహబూబ్నగర్లో 263, జగిత్యాలలో 238, ఖమ్మంలో 213, మంచిర్యాలలో 201 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,960కి పెరగ్గా.. ఇప్పటి వరకు 3,49,692 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 2,208 మంది ప్రాణాలు విడిచారు.