కరోనా నేపథ్యంలో మే 14 వరకు నిలిపివేత
కంటోన్మెంట్, ఏప్రిల్ 28: రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం నుంచి మే 14 వరకు పాస్పోర్ట్ సేవలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 14 తపాలా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పాస్పోస్టు సేవలు అందిస్తుండగా.. వీటన్నింటికి గురువారం నుంచి బ్రేక్ పడనున్నది. ఇందుకు దరఖాస్తుదారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తిచేశారు. సేవలను తిరిగి ప్రారంభించడంపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.