అమరావతి : ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24గంటల్లో 739 కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా 1,333 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. వైరస్తో మరో 14 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 20,22,064కు పెరిగాయి. ఇందులో 19,993,589 మంది కోలుకున్నారు. వైరస్తో 13,925 మంది ప్రాణాలు వదిలారు.
ప్రస్తుతం 14,550 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 166 మందికి, నెల్లూరులో 114 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు పేర్కొంది. కరోనాతో చిత్తూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, అనంతపూర్లో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒకరు మరణించినట్లు చెప్పింది. ఇవాళ 43,594 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 2,69,82,681 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.