ముజఫర్పూర్ (బీహార్): నూడుల్స్ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న బేలా పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. పేలుడుధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం దెబ్బతిన్నాయి.