హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఓపెన్ టెన్త్లో ఆరు పేపర్లకే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్ ఎస్సెస్సీ తరహాలోనే ఓపెన్ స్కూల్స్కు కూడా 70 శాతం సిలబస్నే అమలు చేయనున్నారు. ప్రశ్నల్లో 50 శాతం చాయిస్ ఇవ్వనున్నారు. కాగా, ఈ పరీక్షలు ఈ నెల 31 నుంచి జూన్ 10 వరకు జరుగుతాయని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి సోమవారం తెలిపారు. ఉదయం 8:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు ఒకే రోజు సమాంతరంగా జరుగుతాయని, ఇందుకోసం ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. వారం ముందుగానే హాల్టికెట్లను జారీ చేస్తామని పేర్కొన్నారు. అటు.. జూన్ 21 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
తేది ఇంటర్ ఎస్సెస్సీ
31-5-22 తెలుగు, ఉర్దూ, హిందీ, అరబిక్ తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ
1-6-22 ఇంగ్లిష్ ఇంగ్లిష్
3-6-22 పొలిటికల్ సైన్స్ గణితం
4-6-22 హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ
6-6-22 కామర్స్ /బిజినెస్ స్టడీస్ సోషల్ స్టడీస్
7-6-22 బయాలజీ, ఎకనామిక్స్ ఎకనామిక్స్
8-6-22 గణితం ఉర్దూ
9-6-22 ఫిజిక్స్ హిందీ
10-6-22 కెమిస్ట్రీ —-