తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. నాలుగు కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచియున్నారు. వీరికి నాలుగు గంటల్లో దర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు నిన్న సూర్యగ్రహణంగా కారణంగా ఆలయం ఉదయం నుంచి రాత్రి వరకు మూసివేశారు. రాత్రి 8.30 నిమిషాలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరవగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారిని 25,549 మంది భక్తులు దర్శించుకోగా 9,764 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాలని కోరారు.