న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న 11 మంది ప్లేయర్లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్త్న్ర అందించాలని అవార్డుల కమిటీ కేంద్ర క్రీడాశాఖకు సిఫారసు చేసింది. ఈ జాబితాలో టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా, రవి దహియ (రెజ్లింగ్), లవ్లీనా బొర్గోహై (బాక్సింగ్), భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ, హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్తో పాటు టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణాలు నెగ్గిన అవని లేఖరా, మనీశ్ నర్వాల్ (షూటింగ్) సుమిత్ అంటిల్ (అథ్లెటిక్స్), ప్రమోద్ భగత్, కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్) ఉన్నారు. 35 మంది ప్లేయర్లను అర్జున అవార్డు కోసం కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రతి ఏటా హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జయంతి (ఆగస్టు 29)ని పురస్కరించుకొని అందించే ఈ అవార్డులు.. టోక్యో పారాలింపిక్స్ కారణంగా ఈసారి ఆలస్యమయ్యాయి.
సంప్రదాయంగా ఏటా ఒకరిద్దరికి మాత్రమే ఖేల్త్న్ర అవార్డులు అందిస్తున్నా.. విశ్వక్రీడల నేపథ్యంలో ఈ యేడు అత్యధిక ప్రతిపాదనలు అందాయి. ఖేల్త్న్ర గ్రహీతలకు రూ.25 లక్షలు, అర్జునా అవార్డీలకు రూ.15 లక్షల నగదు పురస్కారం దక్కనుంది. అర్జునా అవార్డుకు సిఫారసు చేసిన వారిలో శిఖర్ ధవన్ (క్రికెట్), భవీనా పటేల్ (పారా బ్యాడ్మింటన్), నిషాద్ కుమార్, సుహాస్ యతిరాజ్ (పారా బ్యాడ్మింటన్)తో పాటు భారత పురుషుల హాకీ జట్టు సభ్యులందరూ.. మహిళల హాకీ జట్టు ప్లేయర్లు వందన కటారియా, మౌనిక.. ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత తొలి మహిళా ఫెన్సర్ భవానీ దేవి తదితరులు ఉన్నారు. ద్రోణాచార్య అవార్డుకు రాధాకృష్ణ, టీపీ ఔసెఫ్ (అథ్లెటిక్స్), సందీప్ సాంగ్వాన్ (హాకీ) పోటీ పడుతున్నారు.