హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 332 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా 331 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు ప్రాణాలు వదిలారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,58,376కు చేరింది. మొత్తం 6,48,648 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మొత్తం 3,876 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో 71,402 టెస్టులు చేయగా.. కొత్త కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,852 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది.