బ్రసిలియా : బ్రెజిల్లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మంగళవారం ఒకే రోజు 3,251 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క సావో నగరంలోనే 1,021 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు రోజువారి కరోనా కేసులు 84వేలకుపైగా నమోదైనట్లు బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం.. మొత్తం మరణాల సంఖ్య 3లక్షలకు చేరుకోగా.. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. లాక్డౌన్ విధించకపోవడం వల్లే కేసులు పెరిగినట్లు ఆ దేశ ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కరోనా కట్టడిలో వైఫల్యం కావడంతో ఆరోగ్యశాఖ మంత్రిని ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తొలగించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ మార్సెలో క్యూరోగాను ఆరోగ్య మంత్రిగా నియమించారు. ఆర్మీ జనరల్ ఎడ్వర్డో పజుఎల్లోకు ఎలాంటి వైద్య అనుభవం లేని వ్యక్తిని ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.