హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 325 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తెలిపింది. కొత్తగా 425 మంది బాధితులు కోలుకోగా.. మరో ఇద్దరు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం సంఖ్య 6,57,119కు చేరింది. ఇప్పటి వరకు 6,47,185 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి 3,859 మంది ప్రాణాలు వదిలారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.48శాతం, మరణాల రేటు 0.58శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో 6,065 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఇవాళ ఒకే రోజు 78,787 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు వివరించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ నుంచి 80, కరీంనగర్లో 26, ఖమ్మంలో 24, హనుమకొండలో 22 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని తెలిపింది.