రైతన్నకు మంచి ఆదాయం తెచ్చిపెడుతున్నది. మూడేండ్లలో ఎన్నడూ లేనంత ధర పలుకుతుండడంతో రైతాంగం కుషీగా ఉంది. దేశంలోనే నాణ్యమైన పత్తికి తెలంగాణ బ్రాండ్ కాగా, రాష్ట్రంలో అత్యధికంగా తెల్లబంగారం పండించే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దూదిపూల ధరహాసం కనిపిస్తున్నది. భారీ వర్షాలతో ఈసారి దిగుబడి తగ్గినా… చేతికొస్తున్న పంటకు క్వింటాకు సగటున రూ.7 వేల నుంచి 8వేల వరకు ధర లభిస్తుండడం విశేషం. దేశవ్యాప్తంగా పత్తి దిగుబడి సరిగ్గా రాకపోవడం, నిల్వలు కూడా లేకపోవడంతో ఈ సీజన్ మొత్తం మంచి ధర పలుకవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవంబర్లో మరింత నాణ్యమైన పత్తి వచ్చే అవకాశం ఉండడంతో రానున్న కాలంలో క్వింటాకు రూ.10వేల వరకు పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తున్నది. బహిరంగ మార్కెట్లోనే మంచి ధర వస్తుండడంతో ఈసారి సీసీఐ కేంద్రాల
అవసరం కూడా ఉండకపోవచ్చని మార్కెటింగ్ శాఖ భావిస్తున్నది. రాష్ట్రంలో పత్తి సాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లా పేరు గాంచింది. దేశంలోనే నాణ్యమైన పత్తికి మారుపేరుగా నిలిచింది. ఈ సీజన్లో నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 6.52లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా సుమారు 45.68లక్షల క్వింటాళ్ల దిగుబడి రావచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో 98వేల ఎకరాల్లో.. 6.50లక్షల క్వింటాళ్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1.26లక్షల ఎకరాల్లో ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల చొప్పున మొత్తం 10లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. సీసీఐ కేంద్రాలతో సంబంధం లేకుండానే బహిరంగ మార్కెట్లో పత్తికి మంచి ధర లభిస్తున్నది. ప్రభుత్వం క్వింటాల్కు రూ.6025 మద్దతు ధరను ప్రకటించగా ధర అంతకంతకూ పెరుగుతున్నది. దాంతో సీసీఐ కేంద్రాలను తెరువాల్సిన అవసరం ఇప్పటికైతే రాలేదు. ఈ సీజన్లో భారీ వర్షాలు, ముసురు కారణంగా పత్తి చేలు 20-30శాతం వరకు దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడిపైనా ప్రభావం పడింది. కానీ, మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. క్వింటాల్కు రూ.6వేల నుంచి మొదలై ప్రస్తుతం జిల్లాలో కొన్నిచోట్ల రూ.8,100 వరకు గరిష్టంగా ధర పలుకుతున్నది.
అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది కమీషన్దారులు, దళారులు రంగంలోకి దిగారు. నేరుగా గ్రామాల్లోని రైతుల వద్దకే వెళ్లి కొనుగోళ్లు చేపట్టారు. కొందరైతే అడ్వాన్స్ ఇచ్చి కూడా కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి లభిస్తున్న ధరలకు పొంతన లేదని చెప్పవచ్చు. 2019లో దళారులు, వ్యాపారులు క్వింటాల్కు రూ.2500 -రూ.3400 ధర చెల్లించారు. 2020లో రూ.3500 నుంచి 4వేల వరకు కొనుగోలు చేశారు. దాంతో రైతులు మద్దతు ధర ఆశించి సీసీఐ కేంద్రాలను ఆశ్రయించారు. జిల్లావ్యాప్తంగా సీసీఐ కేంద్రాలు కిటకిటలాడాయి. జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తిలోడు వాహనాలు కిలోమీటర్ల మేర బారులుదీరాయి. అక్కడ కూడా తేమతో పాటు ఇతర నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే మద్దతు ధర చెల్లించారు. కానీ ఈ సీజన్లో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం వ్యాపారులు ఇండ్ల వద్దకే వచ్చి క్వింటా పత్తికి సగటున రూ.7వేల నుంచి 8 వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
4.50 లక్షల క్వింటాళ్ల మేరకు..
పత్తి దిగుబడులు మొదలైన నాటి నుంచే వ్యాపారులు కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 4.50లక్షల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసి ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 2.25లక్షల క్వింటాళ్లు, సూర్యాపేట జిల్లాలో లక్ష క్వింటాళ్లు, యాదాద్రి జిల్లాలో 1.25లక్షల క్వింటాళ్లు కొనుగోళ్లు జరిగినట్లు భావిస్తున్నారు. అయితే, నవంబర్ నెలలో నాణ్యమైన పత్తి పెద్ద ఎత్తున మార్కెట్కు రానున్నది. నవంబర్ చివరి నాటికి 50 శాతం పత్తి కొనుగోళ్లు పూర్తి కావచ్చని, ఇలాగే ధర లభిస్తే సీసీఐ కేంద్రాలతో అవసరం ఉండకపోవచ్చని నల్లగొండ మార్కెటింగ్ శాఖ ఏడీ శ్రీకాంత్ తెలిపారు.
నాలుగేండ్లుగా పత్తి ధర ఇలా…
2018-19లో ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.5450 ఉండగా 2019-20లో మరో రూ.100 పెంచింది. అదే విధంగా 2020-21లో రూ.5825 నిర్ణయించి రూ.275 అదనంగా పెంచింది. ప్రస్తుతం రూ.6025 మద్దతు ధర నిర్ణయించగా అంతకు మించి ధర పలుకుతున్నది. వరితో పోలిస్తే పత్తి సాగులోనే లాభం ఉన్నదని రైతులు చెప్తున్నారు.
ఇంటి ముందుకే మంచి ధర
వరి కంటే పత్తి సాగే బాగుంది. వరి సాగు చేయాలంటె ఖర్చులు ఎక్కువైనయి.. లాభాలు తగ్గిపోయినయి. పత్తి పండిస్తే వ్యాపారులే ఇంటికివచ్చి మంచి ధర ఇచ్చి కొంటున్నరు. నేను 8ఎకరాల్లో పత్తి సాగు చేసిన. ఎకరానికి 2 ప్యాకెట్ల విత్తనాలు పడ్డయి. ప్యాకెట్ ధర 700 రూపాయల్లెక్కన ఎకరాకు 1,400 ఖర్చయ్యింది. రెండు సార్లు పురుగు మందు కొట్టిన. రెండు నెలల్లో పంట కాపువచ్చింది. 7 నెలల వరకు పత్తి ఏరుకోవచ్చు. ఎకరానికి 10, 12 వేల దాకా ఖర్చు వస్తుంది. 10 నుంచి 12 క్వింటాళ్లు పండుతుంది. క్వింటాకు ఇప్పుడు 8 వేల ధర పలుకుతుంది. 10 క్వింటాళ్లకు కనీసం 80వేలు వస్తయి. ఖర్చులు పోయినా 50, 60 వేల వరకు మిగులుతయి. నీళ్ల సౌకర్యం వుంటే పత్తి సాగే మంచిది. రెండు మూడు తడులు పెట్టుకుంటే చాలు.. మంచి దిగుబడి వస్తది. వరి వేసి ఆర్బాటం తప్ప మిగిలేదేం లేదు. పత్తి చేలతో పోలిస్తే వచ్చే లాభం వరి పొలంలో లేదు. నా కొడుకు వరి వేస్తా అంటే వద్దని పత్తి పెట్టించిన.
ఇంత ధర ఎన్నడూ లేదు
నేను మూడు ఎకరాల్లో పత్తి సాగు చేసినా. ఇప్పటికే 15 క్వింటాళ్ల దాకా అమ్ముకున్నా. క్వింటాకు 7100 రూపాయలు ధర పలికింది. దిగుబడి తగ్గినా ధర పెరగడం వల్ల చాలా మేలైంది. రెండో విడుత ఇంకో 15క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
యాసంగిలో పత్తి, కూరగాయలు వేస్తా…
నేను ఎకరం వరి, అర ఎకరం పత్తి వేశాను. నీళ్లు పుష్కలంగా ఉన్నయి. పత్తి చేను పర్వాలేదు. వరికోత అయిపోయిన తర్వాత యాసంగిలో అరెకరం పత్తి, అరెకరం కూరగాయలు వేయాలనుకుంటున్నా. రైతులు ప్రభుత్వం చెప్పినట్టుగా పంటలు వేసుకుంటే మేలు.
క్వింటాకు 7,400రూపాయలు
ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నా. ఈ ఏడాది దిగుబడి బాగున్నది. పెట్టుబడి కూడా పెద్దగా పెట్టలేదు. వానలు సరైన సమయానికి పడటం వల్ల పంట మంచిగా వచ్చింది. నేను సాగుచేస్తున్న పత్తి మంచి నాణ్యతతో ఉండటం వల్ల కొనుగోలు దారులు మంచి ఉత్సాహం చూపారు. మాఊరిలోనే క్వింటా పత్తి 7400 రూపాయలకు కొన్నరు.
సూర్యాపేట, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల తరబడి కొనసాగుతున్న పోడు భూముల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ముఖ్యమంత్రికి ఇప్పటికే నివేదిక అందించిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు శనివారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో మంత్రి గుంటకండ్ల ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పోడు భూములను సాగు చేసుకుంటున్న వారి వివరాలు పకడ్బందీగా సేకరించాలని ఆదేశించారు. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ
అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. త్వరలో అఖిలపక్ష