అమరావతి : సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కదిరివారిపల్లి గనులలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
ఎర్రగుంట్ల రాణివనం ప్రాంతానికి చెందిన ఏడుగురు కదిరివారిపల్లి గనుల్లోని గుంతల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు.
ఈత కొడుతూ వీరులో ప్రమాదవశాత్తు ముగ్గురు గల్లంతయ్యారు. ఆచూకీ కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి