హైదరాబాద్ : పాతబస్తీలోని హుస్సేనిఆలం పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. పీఎస్ పరిధిలోని పిట్టలోళ్ల బస్తీ పక్కన ఉన్న చంద్రకా పురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.