హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రైలు మార్గాన బంగారం తరలిస్తున్న స్మగ్లర్ను విశాఖపట్నం రైల్వే రీజనల్ యూనిట్ అధికారులు గురువారం అరెస్టు చేశా రు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన రూ.1.91కోట్ల విలువైన 3.98 కిలోల బంగారంతో ఓ వ్యక్తి కోల్కతా నుంచి హౌరా-యశ్వంత్పుర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వస్తున్నట్టు సమాచారం అందింది. విశాఖ రైల్వేస్టేషన్లో డీఆర్ఐ అధికారులు మాటువేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని బంగారు గాజులు, కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని బం గ్లాదేశ్ నుంచి అక్రమం గా తెచ్చినట్టు నిందితుడు అంగీకరించాడు.