హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 298 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా 325 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో ఇద్దరు వైరస్ బారినపడి మృతి చెందారు. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,142కు పెరగ్గా.. ఇందులో 6,50,778 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 3,888 మంది ప్రాణాలు వదిలారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,476 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ ఒకే రోజు 68,097 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.