హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 257 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,57,376కు చేరాయి. కొత్తగా 409 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,47,594 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో ఒకరు వైరస్ బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,870కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.51శాతం, మరణాల రేటు 0.58శాతంగా ఉంది. ఇవాళ ఒకే రోజు 58,335 కొవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ నుంచి 87 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.